Vaccination: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో జరిగింది. మర్లపాలెంకు చెందిన షేక్ సుబానీ (30) మంగళవారం సాయంత్రం గన్నవరం పంచాయతీలో కోవిషీల్డ్ టీకా వేయించుకున్నాడు. కాగా నిన్న రాత్రంతా జ్వరం, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై సుబానీ మృతి చెందాడని బంధువులు పేర్కొంటున్నారు. వాక్సిన్ తీసుకున్న తరువాత అతను మద్యం (ఆల్కాహాల్) సేవించడం వల్ల అస్వస్థతకు గురైయ్యాడనే మాట స్థానికుల నుండి వినబడుతోంది. వ్యాక్సిన్ వికటించి అతను మృతి చెందాడా లేక ఇంకా ఏమైనా కారణంతో మృతి చెందాడా అల్కాహాల్ తీసుకోవడం వల్ల జరిగిందా అనే విషయాలు అధికారుల దర్యాప్తు లో తేలాల్సి ఉంది.
సుబానీ భార్య ఎనిమిది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, కుమారుడి ఆలనా పాలనాను అతనే చూసుకుంటున్నాడు. అతను మృతి చెందడంతో కుమారుడు అనాధ అయ్యాడు. మృతి చెందిన సుబానీ తాపీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.