Crime News: వరంగల్లులో ఈ తెల్లవారుజామున దారుణ హత్యలు జరిగాయి. కుటుంబ, వ్యాపార విబేధాల కారణంగా ఓ వ్యక్తి తన అన్న కుటుంబంపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్లు ఎల్బీనగర్ కు చెందిన మహమ్మద్ చాంద్ బాషా, అతని తమ్ముడు షఫీకి మధ్య పశువుల వ్యాపారానికి సంబంధించి సంవత్సర కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కోటి రూపాయల విషయంలో ఇద్దరి మధ్య విభేధాలు తారా స్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో తెల్లవారుజామున కొందరు వ్యక్తులు చాంద్ బాషా ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భాషా, భార్య సమీరాబేగం, కుమారులు, బావమరుది ఖలీంపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాషా, సమీరా బేగం, ఖలీంలు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో షఫీయే తన తల్లిదండ్రులపై దాడి చేసి చంపినట్లు భాషా కుమార్తె తెలిపినట్లు సమాచారం.