Sunday, April 28, 2024
Home వార్తలు టిడిపి లో చేరికకు సంసిద్ధం : మాగుంట

టిడిపి లో చేరికకు సంసిద్ధం : మాగుంట

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలు లోని మాగుంట నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ….టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.అతి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ముప్పై ఏండ్లుగా ప్రకాశం ప్రజలు తమ కుటుంబాన్ని ఆశీర్వదించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి,మాగుంట పార్వతమ్మ జిల్లా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు.తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ను కోరారు. రానున్న ఎన్నికల్లో మాగుంట రాఘవ రెడ్డిని జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్, ఎస్.ఎన్.పాడు ఇంఛార్జి బి.ఎన్.విజయ్ కుమార్, దామచర్ల సత్య, కందుకూరు ఇంఛార్జి ఇంటూరి నాగేశ్వరావు , యర్రగొండపాలెం ఇంఛార్జి ఎరిక్షన్ బాబు, మార్కాపురం ఇంఛార్జి కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, హర్షిని సంస్థల అధినేత రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

Most Popular

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...