Home వార్తలు అర్చకుల మీద దాడి చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలి : లంకా ప్రసన్న

అర్చకుల మీద దాడి చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలి : లంకా ప్రసన్న

కాకినాడలో పెద్ద శివాలయంలోని ఇద్దరు అర్చకులను వైసీపీ నాయకుడు చేసిన దాష్టీకం చాలా దారుణమైన సంఘటన. ఇది వరకు గుడుల పైన దాడి చేసిన వారు… ఇప్పుడు గుడిలో ఉన్న అర్చకుల పై కాలితో తన్ని దవడ మీద కొట్టడం, ఇంత కన్నా దారుణం ఏమైనా ఉందా అని అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డా. లంకా ప్రసన్న కుమార్ శర్మ ప్రశ్నించారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మనం  ఏ నాగరికంలో ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి. దాడి చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్చకుల కాళ్ళు మొక్కే సంప్రదాయం హిందువులదని అన్నారు. అర్చకులపై దాడి చేయడం అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏమీ లాభం లేదని అన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

 దాడిలో గాయపడిన బ్రాహ్మణ అర్చకులకు ప్రకాశం జిల్లా అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం తరపున తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. అదే విధంగా ఏప్రభుత్వం కానీ పార్టీలో నాయకులు లేక వారి అనుచరులు కానీ అర్చకులు పురోహితులు బ్రాహ్మల జోలికి వస్తే ఇక నుంచి తాట తీయటం పనిగా పెట్టుకుంటామని దేశవ్యాప్తంగా  దేవాలయాలకు తాళాలు వేసుకుని అక్కడే నిరసనలు చేస్తాం అని హెచ్చరించారు. ఈ అత్యవసర సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు దీవి హనుమత్ ప్రసాదాచార్యులు, సురపరాజు రాము, పాలుట్ల సాయికృష్ణ, పోగుల దుర్గ ప్రసాద్ శర్మ, ప్రధాన కార్యదర్శి రామరాజు మల్లిఖార్జున శర్మ, కార్యదర్సులు గుడ్లూరి సురేష్, పిడుగు గోపికృష్ణ, పేర్నమిట్ట నరసింహ రావు, దూపాటి రఘురాం, శంకరమంచి శ్రీధర్ తదిరతులు  పాల్గొన్నారు. సంఘ బాధ్యులతో పాటు నగరంలోని బ్రాహ్మణ నాయకులు టీవీ శ్రీరామ మూర్తి, కామరాజుగడ్డ కుసుమ కుమారి, ఎస్ఏటి రాజేష్, వ్యామజాల ప్రసన్న కుమార్, మారుతీ వినయ్ కుమార్, ఎస్ సుజాత తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపి, ఈ విషయంపై ఖండన తెలిపారు.

Exit mobile version