Sunday, April 28, 2024
Home వార్తలు బ్లూ ఎకానమీ పెంచేందుకు కృషి : జగన్మోహన్ రెడ్డి

బ్లూ ఎకానమీ పెంచేందుకు కృషి : జగన్మోహన్ రెడ్డి

- Advertisement -

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6నెలలకు గాను రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ.647.44 కోట్ల రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ…. దేవుని దయవలన ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మత్స్యకారులను ఆదుకునే విషయంలో ఓఎన్జీసీ కూడా మంచి మనసుతో, సాకులు చూపించకుండా ప్రోయాక్టివ్‌గా కలిసి వచ్చి ఇందులో భాగస్వామ్యులయ్యారని తెలిపారు. ఐదో విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తున్నాం. ఒక్కోక్క మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున అందిస్తున్నాం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారు కుటుంబాలకు నష్టం జరగకూడదనే ఈ అడుగులు వేస్తున్నాం.

ఎమ్మెల్యే సతీష్‌ క్రమం తప్పకుండా డబ్బు విడుదలకు ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సతీష్‌ను అభినందించాలిని పేర్కొన్నారు. అధికారులు కూడా చొరవగా ముందుకు అడుగులు వేసి మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులకు అందించే ఈ ఐదోవిడత సహాయం కింద దాదాపు రూ.162 కోట్లను 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్నాం. కార్యక్రమంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. ఇప్పటివరకూ ఐదు విడతల్లో రూ. 644 కోట్లు ఇచ్చాం. మొత్తం అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 16,408, కాకినాడ జిల్లాలో మరో 7,050 ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు మంచి చేస్తున్నాం.

- Advertisement -

మత్స్యకారులను పట్టించుకోని చంద్రబాబు

- Advertisement -

మనం అధికారంలోకి రాకమునుపు ఇదేరకమైన పరిస్థితిని జీఎస్‌పీసీ వాళ్లు క్రియేట్‌ చేశారు. 2012కు సంబంధించి రూ.78 కోట్లు జీఎస్పీసీ ఇవ్వాల్సి ఉంది. 16,554 కుటుంబాలకు రావాల్సినంది రాని పరిస్థితి ఉంది. గతంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మన అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో మత్స్యకారులకు మేలు మనమే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేస్తూ ఆ రూ. 78 కోట్లను 16వేలకుపైగా మత్స్యకార కుటుంబాలకు ఇచ్చాం. ఆ కుటుంబాల అవసరాలను మన అవసరాలగా భావించి వారికి తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ తర్వాత జీఎస్పీసీని ఓఎన్‌జీసీ టేకోవర్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు దీని గురించి ఓఎన్‌జీసీ దృష్టికి తీసుకొచ్చింది. రెండు, మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చాయి. ఈలోగా మత్స్యకారులకు మంచి చేసే విషంయలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. మత్స్యకారులకు తోడుగా ఉండే విషయంలో రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారంలోకి వచ్చిన నాటినుంచి కల్పిస్తూనే ఉన్నాం.

- Advertisement -

చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వారి సంక్షేమం కోసం తాపత్రయ పడి అడుగులు వేశాం. 1.07 లక్షల కుటుంబాలకు ఈ ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం రూ.538 కోట్లు అందించామని తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 మధ్యలో వేట నిషేధ సమయంలో వారికి సహాయాన్ని అందించాం. ఈ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు హయాంలో ఐదేళ్లకాలంలో మత్స్యకార సోదరులకు కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చింది. మనం ప్రతి ఒక్కరినీ ఈ పథకంలోకి తీసుకొస్తూ… పారదర్శకంగా అందిస్తూ వచ్చాం. గతంలో రూ.4వేల నుంచి మనం రూ.10వేలకు పెంచి ఒక్కో కుటుంబానికి అందిస్తున్నాం. ఇది కూడా దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సహాయం అందించడంలేదు.

బ్లూ ఎకానమీ పెంచేలా చర్యలు

ప్రతి మత్స్యకారుడు తమ కాళ్లమీద తాము నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్‌ హార్బర్‌ లేదా, ల్యాండింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. మనం వచ్చిన తర్వాతనే 10 పిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, 4 పోర్టులు వాయు వేగంతో నిర్మాణం చేస్తున్నాం. తీరవెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచాం. మనకున్న 974 తీరప్రాంతంలో బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకున్నాం. వీటన్నింటి వల్లా మత్స్యకారులు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి ఉపాధి వెదుక్కోవాల్సిన అవసరం లేకుండా… మన రాష్ట్రంలోనే వాళ్లకు గొప్ప జీవితాలు ఉండేటట్టుగా అవకాశాలు మెరుగవుతాయి.ఇవాళ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా నేరుగా అక్కడకు వెళ్లే ప్రారంభిస్తాను. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా మత్స్యకారులు ఏవిధంగా లబ్ధి పొందుతున్నారో తెలియాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ఆ హార్బర్‌ను ప్రారంభిస్తాను.

ఫిషింగ్‌ హార్భర్‌ వల్ల మత్స్యకారుల జీవితాలు మారుతాయి, ఒక్కో ఫిషింగ్‌ హార్భర్‌లో ఎన్ని బోట్లు ఉంటాయి, దీనివలన కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు వలన ఏ రకమైన అభివృద్ది జరుగుతుందనేది ప్రజలకు తెలియాలి. అందుకే ఇవ్వాళ్టి కార్యక్రమాన్ని వాయిదా వేశాం. మొత్తంగా 10 ఫిషింగ్‌ హార్భర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణ పనులతో పాటు, 4 పోర్టుల నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. 4 పోర్టులను దాదాపు రూ.16వేల కోట్ల పెట్టుబడితోనూ, 10 ఫిషింగ్‌ హార్భర్లను రూ.4వేల కోట్లతోనూ, మరో రూ.200 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు అంటే మొత్తంగా దాదాపు రూ.20వేల పై చిలుకు కోట్లతో సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల మీద పెట్టుబడి పెడుతున్నాం. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. వీటివల్ల అత్యధికంగా మత్స్యకార కుటుంబాలు గణనీయంగా బాగుపడతాయి.వీటన్నింటివల్లా మంచి జరగాలని మనసారా ఆశిస్తూ.. ఇంకా మంచి చేసే అవకాశం కల్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...