ఇరవై కేజీల బియ్యం కాదు…ఇరవై సంవత్సరాల భవిష్యత్ కోసం పార్టీ స్తాపించాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఎన్నికలకు పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు సాధించలేకపోయారు? 25 రోజుల తరువాత పార్టీ భవిష్యత్ ఏమిటి అని మిరైన చెప్పగలరా? పొత్తులో బాగంగా 21 స్థానాలతో జనసేన కు , రాష్ట్ర ప్రజలకు ఏమీ భవిషత్తు ఇవ్వగలరు అని పోతిన మహేష్ ప్రశ్నించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇప్పటివరకు జనసేన లో ఇష్టపడి కష్టపడి పని చేశాం.మీ స్వార్థానికి మా కుటుంబాలు బలిపోతున్నాయని వాపోయారు.రాజకీయాల్లో నటించే వ్యక్తి ఎవ్వరికీ ఎప్పటికీ భరోసా ఇవ్వలేరని పేర్కొన్నారు. జనసేన లో కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాము.నిలువెల్లా ఒక పాషాణ హృదయంతో స్వార్థ పరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవ్వలేదు.ఇన్నాళ్లు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తి తో ప్రయాణం చేశామా అని మా మిద మాకే జాలి వేస్తుంది. ప్రజాస్వామ్య బద్ధంగా సేవ చేసేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారు.కానీ ఏనాడు కూడా పార్టీ క్యాడర్ పట్ల,జనసేన వీర మహిళలు భవిష్యత్తు పట్ల దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల మీ నైజాన్ని తెలుపుతుంది.మీకు తెలియకుండా జరుగుతున్న విషయాలు పై మీకు చెప్పాలని అనుకున్నాం..కానీ మీరే ఇదంతా చేస్తున్నారని గ్రహించలేక పోయాం అని పేర్కొన్నారు. జనసేన లో అన్ని తాత్కాలికమే అంతా నటనే అని మేము గుర్తించలేక పోయాము అని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రజలే తెలివైన వారు
పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు భావజాలాన్ని ప్రజలు అర్థం చేసుకోవడంలో ప్రజలు వెనుకపడ్డారెమో….వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేద్దామని అనేక ప్రయత్నాలు చేశాం. ప్రజలు జనసేన సైనికులు , వీర మహిళలు కంటే చాలా తెలివైన వారు.మాకంటే ఐదేళ్లు ముందు ఉన్నారు అని అన్నారు.అందుకే 2109 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను చిత్తు చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.