శ్రీ క్రోది నామ తెలుగు సంవత్సరం రైతుకు క్షేమం కలిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు చూపాలి.కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. రాష్ట్రం కొత్త బాటలో పయనించి వెలిగిపోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. మంగళవారం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు లోని నివాస గృహంలోకి ప్రవేశించి పూజలు చేశారు.నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎన్.ఎస్ వర్మ ,బీజీపీ ఇంఛార్జి కృష్ణంరాజు , కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోది నామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని కొరుకున్నానని తెలిపారు.శ్రీ పురుహాతిక అమ్మవారి ఆశీస్సులు, శ్రీ పాద వల్లభుడు దీవెనలు , బంగారు పాపమ్మ అండదండలతో పిఠాపురం నుంచి విజయ ప్రస్థానం ప్రారంభించ పోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు.