Home వార్తలు Visakha: మత్స్యకారుల మధ్య వివాదం..విశాఖ సాగరతీరంలో ఉద్రిక్తత

Visakha: మత్స్యకారుల మధ్య వివాదం..విశాఖ సాగరతీరంలో ఉద్రిక్తత

Visakha: మత్స్యకారుల మధ్య వివాదం కారణంగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విశాఖలోని పెద్దజాలరిపేట, చిన్నజాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు వలల వివాదం చోటుచేసుకుంది. ఒక వర్గం రింగు వలలతో వేటకు వెళ్లడంతో మరో వర్గం వారిని అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే సముద్రంలోని పడవలకు ఒ వర్గం మత్స్యకారులు నిప్పు పెట్టారు. మొత్తం నాలుగు బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో కోస్ట్ గార్డు హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. ఈ వివాదంతో వాసవానిపాలెం తీరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బోట్లకు నిప్పు పెట్టారనీ, తమ పిల్లలను ఓ వర్గం అపహరించిందని మరో వర్గానికి చెందిన మహిళలు ఆరోపిస్తన్నారు. వలలు కోసేశారనీ, తమ వాళ్లను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Exit mobile version