Thursday, May 2, 2024
Home వార్తలు Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా .. బాబు కోటరీపై కీలక వ్యాఖ్యలు

Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా .. బాబు కోటరీపై కీలక వ్యాఖ్యలు

- Advertisement -

Divyavani: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపిన దివ్యవాణి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖలో మాత్రం తన వ్యక్తిగత కారణాలు అని పేర్కొన్నప్పటికీ మీడియా సమావేశంలో పార్టీ కార్యాలయంలో రాజకీయాలను ప్రస్తావించారు.  ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి తర్వాత దాన్ని ఆమె డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దివ్యవాణి బుధవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తరువాత కొద్దిసేపటికే తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంత కాలంగా పార్టీ అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతూ వస్తున్నారని, పార్టీలో అవమానాలకు తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశం పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఓ దశలో దివ్యవాణి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన లాగా పార్టీలో ఇబ్బందులు పడేవారు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్లకు పదవులు అవసరం కాబట్టి అలా ఉంటున్నారని దివ్యవాణి అన్నారు. గౌరవం లేని చోట ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు బుధవారం పార్టీ ఆఫీసుకు వెళితే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని దివ్యవాణి అవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే..అందరికంటే ముందు తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. సినీ రంగంలో బాలకృష్ణ కంటే తానే పెద్ద నటినని పేర్కొన్నారు.  టీడీపీలోకి సినీ రంగం నుండి వచ్చిన అనేక మంది ఇమడలేక బయటకు వెళ్లిపోయారంటూ జయప్రద, జయసుధ,  ఆలీ, రోజా పేర్లను ప్రస్తావిస్తూ ఇప్పుడు తన వంతు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు దివ్యవాణి.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...