- Advertisement -
Darsi: జిల్లాలోని దర్శి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒంగోలులో చికిత్స పొందుతూ నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సానికొమ్ము పిచ్చిరెడ్డి 1989, 1999 లలో రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. సానికొమ్ము పిచ్చిరెడ్డి మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -