- Advertisement -
Kanigiri News: కనిగిరిలోని పామూరు బస్టాండ్ వద్ద ఓ సైకో చేసిన వీరంగం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తి బస్సుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో బస్సుకు ప్రమాదం తప్పింది.
- Advertisement -
స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మొగళ్లూరుకు చెందిన ఏడు కొండలుగా గుర్తించారు. పోలీసుల వద్ద ఆ వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పడం, పెట్రోల్, డీజిల్, బంగారం ధరలను అదుపు చేసేందుకు శివరాత్రి వరకూ పూజలు చేయాలంటూ ఏదేదో మాట్లాడుతుండటంతో మతిస్థిమితం తప్పి ఇలా ప్రవర్తిస్తున్నాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -