Crime News: మొగుడిపై కోపంతో ఓ భార్య చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది. నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోయడంతో తీవ్ర గాయాలతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో జరిగింది.
విషయంలోకి వెళితే.. ఏలూరులోని పత్తేబాధ లో మాచర్ల నాగేంద్ర టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పద్మావతి, బిటెక్ చదువుతున్న కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. అయితే భర్తపై ఎందుకు తీవ్ర కోపం వచ్చిందో తెలియదు కానీ నాగేంద్ర నిద్రిస్తుండగా సలసల కాగే నీళ్లను భార్య పద్మావతి పోసింది. దీంతో నాగేంద్ర ఛాతీ, పొట్ట, పురుషాగంపై మరుగుతున్న నీళ్లు పడటంతో తీవ్ర గాయాలైయ్యాయి. అతన్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భార్య, భర్తల మధ్య వచ్చిన వివాదం కారణంగా పద్మావతి ఈ పైశాచికత్వంకు ఒడిగట్టినట్లుగా భావిస్తున్నారు. నాగేంద్ర వద్ద నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టూ టౌన్ సీఐ బోణం ఆది ప్రసాద్, ఎస్ఐ కిషోర్ బాబులు నిందితురాలు పద్మావతిని విచారిస్తున్నారు.