Friday, May 3, 2024
Home వార్తలు TDP MLAS Letter: సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల ఘాటు లేఖ..! ఎందుకంటే..?

TDP MLAS Letter: సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల ఘాటు లేఖ..! ఎందుకంటే..?

- Advertisement -

TDP MLAS Letter: ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావులు సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు. ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో వీరు జిల్లా సమస్యలపై బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలోని ప్రధాన అంశాలపై సీఎం జగన్ స్పందించకపోవడంతో ఘాటుగా మరో లేఖ రాశారు. మా జిల్లాకు మీ రాక , మా ప్రజలకు అందరికీ సంతోషం కన్నా, ఎక్కువ విచారాన్ని మిగిల్చింది. మా జిల్లా ప్రగతి విషయంలో, మా జిల్లా సమస్యల విషయంలో మీరు ఏ మాత్రం శ్రద్ద వహించడం లేదని నూటికి నూరుశాతం రుజువయ్యింది. మేము ముందు మీకు రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారు. మా జిల్లా ఆవేదనని అర్ధం చేసుకోలేదు. ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలు, జిల్లాలో తీవ్ర సంక్షోభాన్ని చూడలేదు. మేము లేవనెత్తిన సమస్యల్లో ఏ ఒక్కదానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదు. వెలుగొండను అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్ చేర్చి అంశం, జిల్లా అభివృద్ధిపై ఏమి మాట్లాడలేదు, మేము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేదు. కేవలం రాజకీయ విమర్శలే చేశారు. అందుకే మరోసారి మా ఆవేదనను మీ ముందుకు తీసుకొస్తూ.., సుదీర్ఘ కాలం తర్వాత మా జిల్లాకు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాస్తున్నాం అని పేర్కొన్నారు.

Prakasam News: TDP Temp Closed in Those Two Const

టీడీపీ నేతల లేఖ పూర్తి పాఠం..

- Advertisement -

అయ్యా సీఎం గారూ

- Advertisement -

జిల్లాకు వచ్చారు. సభ ఎక్కారు. ఆసరా అన్నారు. నాలుగు మాటలు చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమాన్ని మరిచి మాయ మాటలు చెప్పారు. వేదికపై ఏదో రాజకీయ విమర్శలు చేశారు, కాకి లెక్కలతో గత టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లారు వెళ్లారు. “రాజకీయం తప్ప పరిపాలన చేతకాని” మీ నుండి ఇంత కంటే ఏం ఆశించగలం. కాకపోతే ఒంగోలు వచ్చినందుకు, జిల్లాలో అడుగు పెట్టినందుకు మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. మా జిల్లా రైతులు, మా యువత, మా మహిళలు, మా నిరుద్యోగులు, మా ప్రజలు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం మీరు ఒక్క భరోసా అయినా ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూసారు. మా జిల్లాకు ఎంతో కొంత మంచి చేయాలని… “ఏదైనా ఒక శాశ్వత ప్రాజెక్టు ఇస్తారేమో.., ఒక పరిశ్రమ ప్రకటిస్తారేమో.., పోర్టు నిర్మాణంపై స్పష్టత ఇస్తారేమో.., యువతకు ఉపాధి దారి చూపిస్తారేమో.., వెలుగొండ ప్రాజెక్టు గెజిట్ పై పోరాడదాం అంటారేమో.., రైతులకు సాగునీటి భరోసా అందిస్తారేమో.., మీరే చంపేసిన గ్రానైట్ పరిశ్రమని బతికించేలా ప్రకటన చేస్తారేమో.., జిల్లాలో సుబాబుల్, జామాయిల్ రైతులకు ధర వచ్చేలా ప్రోత్సహిస్తారేమో”నని ఎంతో కొంత నమ్మకంతో ఎదురు చూశాము.. మీకు గుర్తుండే ఉంటుంది.. “జిల్లాలో పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంగా చీమకుర్తి బహిరంగ సభలో మీరు మాట్లాడుతూ “గ్రానైట్ పరిశ్రమకు చేయూతనిస్తా, విద్యుత్తు రాయితీలు అందిస్తా” అన్నారు. కానీ గ్రానైట్ క్వారీలను, పరిశ్రమలను పిండి, తైలం తీసేసి, పిప్పి చేసేసి ఇప్పుడు కనీసం పట్టుంచుకోవడం లేదు. ఆ పరిశ్రమను నమ్ముకుని జిల్లాలో లక్ష కుటుంబాలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు..! “మీకు గుర్తుండే ఉంటుంది.. మీ పాదయాత్ర సమయంలో జిల్లాలోని అద్దంకి, ఇతర ప్రాంతాల్లో సుబాబుల్, జామాయిల్ టన్నుకు రూ. 5,000/- ఇస్తామన్నారు. అవన్నీ ఉట్టి మాటలేనా..!?

- Advertisement -

మీరు వచ్చారు, వెళ్లారు. ఆసరా పేరిట కల్లబొల్లి మాటలు, కాకమ్మ కబుర్లతో కాలక్షేపం చేసి వెళ్లిపోయారు. ఆ పథకం కూడా సక్రమంగా లబ్దిదారులకు చేరడం లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది 12 లక్షల మందిని కట్ చేశారు. పోనీ మా జిల్లాపై ఏమైనా మాట్లాడతారేమో, మేము రాసిన లేఖపై స్పందిస్తారేమో అనుకుంటే.., కనీసం జిల్లాలోని మంత్రులు కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ మా జిల్లాకు ఇది కావాలి, మా ప్రజలు ఇది అడుగుతున్నారు, మా జిల్లాలో ఇది అత్యవసరం అని అడగలేకపోయారు.

అయ్యా.. జగన్ మోహన్ రెడ్డి గారూ…

రాజకీయాలకు అతీతంగా ప్రజాకాంక్ష, ప్రజాభీష్టం, ప్రజాభిప్రాయం మేరకు మరోసారి అడుగుతున్నాం.. వెలుగొండ ప్రాజెక్టుని గెజిట్ లో చేర్చేలా కేంద్రంతో మాట్లాడండి. జిల్లాకు ఒక పరిశ్రమని ప్రకటించండి. రామాయపట్నం పోర్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోండి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమని బతికించండి. సుబాబుల్, జామాయిల్ రైతులకు మద్దతు ధర దక్కేలా చూడండి. నిత్యావసరాల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోండి. రైతులకు సకాలంలో సాగునీరు, ఎరువులు అందేలా బాధ్యత వహించండి. గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ. 274 కోట్ల పథకాన్ని రద్దు చేయటం సరికాదు. పాలేరుపై నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి, పూర్తిచేయాలి. రాళ్లపాడు ప్రాజెక్ట్‌ను ఆధునీకరించి ఆయకట్టు పెంచాలి. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే మోటర్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలి. ఈ కీలక సమయంలో ప్రకాశం రైతులకు, ప్రజలకు అండగా నిలవండి అని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...