Home వార్తలు CORONA: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం..!నాలుగు రోజుల వ్యవధిలో 76 మందికి కరోనా

CORONA: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం..!నాలుగు రోజుల వ్యవధిలో 76 మందికి కరోనా

CORONA: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నెల 16వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి వారం రోజుల్లో ఎటువంటి కేసులు నమోదు కాలేదు, కానీ 24వ తేదీ నుండి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24న 35 మంది, 25న 18 మంది, 26న 11 మందికి, 27న ఎడుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల వ్యవధిలో 28 మంది విద్యార్ధులు, 48 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.  

ఉలవపాడు మండలం వీరేపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్, వెలిగండ్ల మండలం వెదుల్లచెరువు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్, డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో, అటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవన్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్వహించిన నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాఠశాలల్లో కరోనా కేసుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు వివరించారు. పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్ ను పక్కా గా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ కేసులు నమోదైన పాఠశాలలను విద్యాశాఖ అధికారులు సందర్శించి వివరాలు టాస్క్ ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు.

Exit mobile version