- Advertisement -
Corona cases in schools: ప్రకాశం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో కరణ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 67 మంది ఉపాధ్యాయులు, 53 మంది విద్యార్థులు, ఆరుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పాఠశాలలో సరి దేశి విధానం అమలు చేస్తూ పరిమిత సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గత నెల 16వ తేదీ నుండి పాఠశాలలను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నెల 28వ తేదీ నుండి కరోనా కేసులు నమోదవుతున్నాయి. పలు పాఠశాలలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. భౌతిక దూరం పాటించకుండానే తరగతుల నిర్వహణ జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్న విషయాన్ని విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.
- Advertisement -