CM YS Jagan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అశంలాలు, రెవెన్యూ లోటు, తెలంగాణ నుండి రావాల్సిన నిధులపై చర్చించడంతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. ప్రధాన అంశాలపై మోడీకి సీఎం జగన్ వినతి పత్రం అందించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ కొద్ది సేపటిలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఆ తరువాత రాత్రి 9.30 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఈ రాత్రికి జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం మరి కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత మధ్యాహ్నానికి తిరుగు ప్రయాణం అవుతారు.