- Advertisement -
AP Govt:ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానున్నది. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలతో రాష్ట్రంలో 26 జిల్లాలు అవ్వగా మరో కొత్త జిల్లా ఏర్పాటునకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాలను నిన్ననే ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో గిరిజన ప్రాంతాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
- Advertisement -
గతం నుండి రంపచోడవరం కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మరో కొత్త జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి పేర్ని నాని సంకేతాలు ఇచ్చారు.
- Advertisement -