Home వార్తలు ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 3084 మంది అభ్యర్థులు.వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పోటీచేసే పులివెందుల నుంచి 37 నామినేషన్స్ దాఖలు అయ్యాయి.కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ 42 నామినేషన్ల దాఖలు అయ్యాయి.టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి 32 ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచి 19 నామినేషన్ల దాఖలు అయ్యాయి.టీడిపి జాతీయ ప్రధాన నారా లోకేష్ పోటీచేసే మంగళగిరి నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా 65 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.నందమూరి బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19 నామినేషన్లు. బీజేపీ చీఫ్ పురేందేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్ నుంచి 22 దాఖలు అయ్యాయి. వీరందరిలో ఎంతమంది బరిలో ఉంటారు అనేది నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తెలియనుంది.

Exit mobile version