- Advertisement -
AP DGP: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీ సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్ కు ప్రభుత్వం ఆదేశించింది.
- Advertisement -
డీజీపీగా గౌతమ్ సవాంగ్ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొదటి నుండి జగన్ కు అనుకూలంగానే ఉన్నారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక అంశాల్లో ఏపి పోలీసులు అవార్డులు కూడా అందుకున్నారు.
- Advertisement -