- Advertisement -
Dog Beat: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపర్చింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆ రోడ్డులో వచ్చి వెళ్లే వారిపై ఆ పిచ్చికుక్క దాడి చేసింది. దొరికిన ప్రతి ఒక్కరికి తన పళ్ల గాటు రుచి చూపించింది. ఈ పిచ్చి కుక్క స్వైరవిహారంలో మొత్తం 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో పెద్దలు, పిల్లలు ఉన్నారు. బాధితులు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -
పిచ్చికుక్క దాడిలో మొత్తం 25 మంది గాయపడగా వారిలో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సాలమ్మ అనే మహిళ వేలు తెగిపోగా పలువురి శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. పిచ్చి కుక్క గ్రామస్తులను గాయపరుస్తుండటంతో గ్రామస్తులు ఆగ్రహంతో కర్రలతో కొట్టి చంపారు. గ్రామంలో ఊర కుక్కల బెదడ ఎక్కువ కావడంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -