- Advertisement -
Road Accident:ఆదివారం అర్థరాత్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై చనిపోయి పడి ఉన్న గేదెను ఎక్కిన టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
- Advertisement -
క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదు.
- Advertisement -