10th,Inter Exams: కరోనా నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాల నుండి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు. 2020, 2021 విద్యా సంవత్సరంలో కరోనా విజృంభన కారణంగా ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. అయితే ఈ ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, పాఠశాల తరగతులు యథావిధిగా జరగడంతో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు
టెన్త్ తరగతి పరీక్షలను మే 2వ తేదీ నుండి మే 13వ తేదీ వరకూ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొత్తం 6,39,805 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్చి 11 నుండి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1456 సెంటర్ లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,05,052 మంది విద్యార్ధులు, రెండో సంవత్సరం పరీక్షలకు 4,81,481 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. మొత్తం 9,86,533 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారని తెలిపారు.