Saturday, April 27, 2024
Home విశ్లేషణ MLA RK Roja: మంత్రి పదవి ఆశిస్తే కార్పోరేషన్ చైర్మన్ గిరీ దిక్కాయే..! ఇప్పుడు అదీ...

MLA RK Roja: మంత్రి పదవి ఆశిస్తే కార్పోరేషన్ చైర్మన్ గిరీ దిక్కాయే..! ఇప్పుడు అదీ పాయె..! మంత్రి పదవి జాబితాలో ఉన్నట్లేనా..!!

- Advertisement -

MLA RK Roja: వైసీపీ ఫెయిర్ బ్రాండ్ మహిళా ఎమ్మెల్యే రోజా తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. సినీ రంగం నుండి  టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటి రోజా ఆ తరువాత వైసీపీలో చేరి సీఎం వైఎస్ జగన్ వద్ద మంచి పరపతి సాధించారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డిప్యూటి సీఎం నారాయణస్వామితోనూ ఆమెకు విభేదాలు ఉండటంతో పార్టీలో, నియోజకవర్గంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలోనూ, బయట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తదితరులపై పంచ్ డైలాగ్ లతో తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ తన మార్కును ప్రదర్శిస్తుంటారు రోజా.

- Advertisement -

రోజాకు తొలి విడతలోనే మంత్రి పదవి వరిస్తుందని ఆమెతో పాటు పార్టీలోనూ చాలా మంది అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించలేకపోయారు. దీంతో ఆమె అలిగారు. అయితే ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చినా అయిష్టంగా ఒప్పుకుని స్వీకరించారు. మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్న నేపథ్యంలో ఈ సారి ఛాన్స్ తగలవచ్చేమో అన్న అభిప్రాయంలో ఉన్నారు ఆమె. అప్పటికి మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నామినేటెడ్ పదవుల పందేరంలో ఆమె పదవిని వేరే వారికి ఇచ్చేశారు.

- Advertisement -

ఇకపోతే చిత్తూరు జిల్లా నుండి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లా నుండి రోజాతో పాటు సీఎం జగన్ కు సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మంత్రి పదవులపై ఆశతో ఉన్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో విబేధాలు ఉండటంతో ఆమెకు మంత్రి పదవి అందని ద్రాక్షే అవుతుందా లేక మంత్రి పదవి వరిస్తుందా అన్నది వేచి చూడాలి.  

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...