Tuesday, April 30, 2024
Home విశ్లేషణ YS Viveka Case: సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు..! కొత్త కొత్త ట్విస్ట్ లు..!!

YS Viveka Case: సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు..! కొత్త కొత్త ట్విస్ట్ లు..!!

- Advertisement -

 

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. సీబీఐ దూకుడు పెంచి నెల రోజులకుపైగా కడపలోనే మకాం వేసి విచారణ జరుపుతున్నా ఒక కొలిక్కి వచ్చినట్లు కనబడటం లేదు. అయతే ఈ సారి ఎలాగైనా కేసు దర్యాప్తును పూర్తి చేసి అరెస్టులు చేసే అవకాశం ఉందని అందుకే ఇంతకు ముందులా కాకుండా రోజుల తరబడి విచారణను కొనసాగిస్తున్నారని అంటున్నారు.

- Advertisement -

అయితే సీబీఐ నాల్గవ విడత జరుపుతున్న ఈ విచారణలో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.  విచారణ క్రమంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో వివేకా కుమార్తె సునీతను విచారణ చేయాలంటూ సుబ్బారాయుడు అనే వ్యక్తి కోరడంతో సుబ్బారాయుడి పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సునీత గతంలో ఇచ్చిన అనుమానితుల పేర్లలో సుబ్బారాయుడు పేరు ఇవ్వలేదు. ఇప్పుడు సుబ్బారాయుడు అనే వైసీపీ నాయకుడు పేరు చెప్పి విచారణ చేయాలని కోరడంతో కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది.

- Advertisement -

ఇప్పటి వరకూ సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకా పిఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, డ్రైవర్ ప్రసాద్, వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ తదితరులను ఎక్కువ సార్లు పిలిపించి విచారణ చేశారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన వాహనాలు వివరాలను కూడా సేకరించిన సీబీఐ అధికారులు సదరు వాహనాల యజమానులు, డ్రైవర్ లను పిలిచి కూడా విచారించారు. అయితే సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో వివేకా కుమార్తె కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకురావడంతో సిబీఐ అధికారుల్లో కొత్త అనుమానాలు కలుగుతున్నాయట. సునీత ఏమైనా తెలిసిన విషయాన్ని దాస్తున్నారా ? ఆమె వద్ద ఏమైనా కీలక సమాచారం ఉందా? అనుమానితుల పేర్లు మొదట చెప్పకుండా ఇప్పుడు ఎందుకు వెల్లడిస్తున్నట్లు? అనేది దానిపై సీబీఐ అధికారుల మదిలో కొత్త ప్రశ్నలు మొదలు అవుతున్నాయి. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో అసలు దోషులను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనీ అందుకే పూర్తి స్థాయిలో దృషి సారించారని అంటున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు ? : జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో ఆయన పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తుకువస్తుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపీ...

పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను...

న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

వివేకానంద రెడ్డి రక్తం కళ్ళ చూసిన ఎంపి.అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేయటం వలనే తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల...

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...