Sunday, May 5, 2024
Home వార్తలు ఉన్నతాధికారిపై దురుసు ప్రవర్తన .. తర్లుపాడు తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

ఉన్నతాధికారిపై దురుసు ప్రవర్తన .. తర్లుపాడు తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

- Advertisement -

ప్రకాశం జిల్లా తర్లపాడు తహశీల్దర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సమీక్షా సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ తో దురుసుగా మాట్లాడిన ఫలితంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆయనను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వళితే ఈ నెల 15వ తేదీన మార్కాపురం డివిజన్ పరిధిలోని మండల తహశీల్దార్ లతో స్పందన, ముటేషన్లు, సచివాలయ సేవలు, నీటి తీరువా వసూళ్లు, మీసేవ తదితర అంశాలపై సబ్ కలెక్టర్ సేతు మాధవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమయంలో తర్లుపాడు తహశీల్దార్ పివి కృష్ణారెడ్డి పనితీరుపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టర్ తో నన్నే అలా మాట్లాడతారా అంటూ తహశీల్దార్ వాదనకు దిగి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. తహశీల్దార్ ప్రవర్తించిన తీరును వివరిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ దినేష్ కుమార్ కు సబ్ కలెక్టర్ సేతు మాధవన్ నివేదిక సమర్పించారు. దీంతో తహసీల్దార్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి డిప్యూటి తహశీల్దార్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....