Thursday, April 25, 2024
Home వార్తలు జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో హెటిరో సంస్థకు బిగ్ షాక్.. సీబీఐ కేసులో కీలక...

జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో హెటిరో సంస్థకు బిగ్ షాక్.. సీబీఐ కేసులో కీలక వ్యాఖ్యలు

- Advertisement -

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ ఫార్మా కంపెనీ హటిరో కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమ పై సీబీఐ కేసు నమోదు చేయడాన్ని హెటిరో సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తొలుత కేసు క్వాష్ కోసం సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టును హెటిరో ఆశ్రయించగా, ఆ కోర్టులు నిరాకరించడంతో హెటిరో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

హెటిరో పిటిషన్ పై సుప్రీం కోర్టులో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జోసెఫ్ ల నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. హెటిరో సంస్థపై కేసు కొట్టివేయదగినది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ సంస్థలో హెటిరో పెట్టుబడులు పెట్టిందనీ, ఆ తర్వాత హెటిరోకు 80 ఎకరాలు కేటాయించారని ధర్మాసనం పేర్కొంది. జగన్ కంపెనీ ప్రారంభించకుండానేరూ.350 ల ప్రీమియంతో హెటిరో షేర్లు కొనుగోలు చేసిందనీ, ఇవన్నీ దాచేస్తే దాగవని ధర్మాసనం పేర్కొంటూ పెట్టుబడులు నూటికి నూరు శాతం సత్యాలని అభిప్రాయపడింది. వీటిపై సీబీఐ పక్కాగా చార్జిషీటు దాఖలు చేసిందనీ, కావున హెటిరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. హెటిరోపై దాఖలైన కేసు కొట్టివేతకు ధర్మాసనం నిరాకరించింది.

- Advertisement -

ఈ సందర్భంలో హెటిరో గ్రూపు మొత్తాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చడం సరికాదని ఆ సంస్థ తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కంపెనీ సిబ్బందిపై కేసు పెట్టాలి కానీ కంపెనీపై కాదని విన్నవించారు. అయితే ఈ వాదనలను సుప్రీం ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. హెటిరో సంస్థలు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...

Most Popular

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...