Thursday, May 2, 2024
Home వార్తలు Prakasam News: రాములోరికి కోపం వచ్చిందంట..? మునగపాడు గ్రామస్తుల ఆందోళన..?

Prakasam News: రాములోరికి కోపం వచ్చిందంట..? మునగపాడు గ్రామస్తుల ఆందోళన..?

- Advertisement -


Prakasam News: వేప చెట్టుకు పాలు కారుతున్నాయనీ, వినాయకుడు పాలు తాగుతున్నాడనీ, సాయి బాబా విగ్రహం నుండి వీపూధి పడుతోందనీ ఇలా అనేక ఘటనలు గ్రామాల్లో ప్రచారం జరగడం చూశాం. తాజాగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామంలో అటువంటి చిత్రమైన ఘటనే చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయంలో సీతారాముల విగ్రహం కళ్ల నుండి నీరు కారుతుండటం ఆశ్చర్యాన్ని కల్గించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. దీంతో ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఆలయానికి బారులు తీరారు. అయితే దీనిపై ఆలయ పూజారి స్పందించారు. ఇటీవల తాను విగ్రహాలు శుభ్రపరిచే సమయంలో చింతపండు వాడాననీ, అందువల్ల నీరు కారుతున్నాయేమోనని సందేహం వ్యక్తం చేశారు.

అయితే గ్రామస్తులు మాత్రం ఇది ఓ సంకేతంగా చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఈ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం లేదనీ, అందుకే రాములోరికి కోపం వచ్చిందేమోనని సందేహ పడుతున్నారు. అందుకే విగ్రహం కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చెడు సంకేతంగా వారు ఆందోళన చెందుతున్నారు. స్వామివారిని శాంతింపజేసేందుకు ఉత్సవాలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. శాస్త్ర సాంకేతికంగా మానవులు ముందుకు సాగుతున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, మూడ భక్తి ఇంకా కొనసాగుతున్నాయి అనడానికి ఇదీ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...