Friday, March 29, 2024
Home వార్తలు Darsi Elections: "దర్శి"లో గెలుపెవరిది..!? ఎవరికీ ఎన్ని వార్డులు..!?

Darsi Elections: “దర్శి”లో గెలుపెవరిది..!? ఎవరికీ ఎన్ని వార్డులు..!?

- Advertisement -

Darsi Elections: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. జిల్లాలోని దర్శి నగర పంచాయతీలో ఎన్నికలు ముగిసాయి.. దాదాపు 78 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. ఇప్పుడు ఫలితాల కోసం ఎవరి అంచనాల్లో వారున్నారు.. ఎవరి లెక్కల్లో వారున్నారు.. అధికార వైసీపీ ధీమాగానే ఉన్నప్పటికీ.. టీడీపీ నుండి ఈ స్థాయిలో ఫైటింగ్ అధికార పార్టీ ఊహించలేదు.. ఏకపక్షంగా జరగాల్సిన ఎన్నికలకు కాస్త.. అధికార పార్టీకి ధీటైన పోటీ ఇస్తూ పోల్ మేనేజ్మెంట్ లో కూడా ఇరు పార్టీలు పోటీ పడ్డాయి.. దీంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

వైసీపీ తరపున గెలుపు బాధ్యతని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తన భుజాన వేసుకున్నారు.. అయితే ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.. ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.. వైసీపీలో కూడా ఈ పేర్లపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. అయితే అందరూ కలిసే పని చేసారు. వర్గ విబేధాలు వదిలేసి.. ఎమ్మెల్యే వర్గం, మాజీ ఎమ్మెల్యే వర్గం కలిసి పార్టీ కోసం పని చేశారు. అంచేత ఎక్కడా సమస్యలు రాలేదు.. ఆ పార్టీకి అదే పెద్ద బలం. * ఇక టీడీపీ తరపున 11 వ వార్డు నుండి పోటీ చేసిన పిచ్చయ్య చైర్మన్ అభ్యర్థిగా ఖరారయ్యారు. టీడీపీ కూడా నాయకులూ అందరూ కలిసి పని చేశారు. ఆర్ధిక అంశాల్లో కూడా ఎక్కడా తగ్గలేదు. అధికార పార్టీ ఎక్కడ ఎంత ఇచ్చారో.. టీడీపీ కూడా అంతే ఇచ్చింది. ఈ పరిణామాన్ని వైసీపీ ఊహించలేదు. 11 వ వార్డులో మాత్రం భారీగానే పంపిణీ జరిగినట్టు సమాచారం.. ఇక్కడ టీడీపీ చైర్మన్ అభ్యర్థిని ఓడించడానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేసిందని.. చేయకూడని పనులు కూడా చాలా అమలు చేశారని టాక్..!

- Advertisement -

Darsi Elections: వైసీపీకి 13.. టీడీపీకి 6..!!

- Advertisement -

దర్శి ఎన్నికలలో చాలా అంశాలు పని చేశాయి. సామజిక సమీకరణాలు.., ఆర్థికపరమైన అంశాలు.., అధికారం.., సానుభూతి.. అన్నీ రగిల్చారు. చివరి రోజున అధికార పార్టీ అన్ని రకాల అస్త్రాలను రంగంలోకి దించింది.. ఇక దర్శిలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి.. మాకు ఉన్న సోర్సులు ఆధారంగా ఈ నగర పంచాయతీలో వైసీపీ 13 వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది.. టీడీపీకి 6 వార్డులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మూడు వార్డుల్లో బాగా హోరాహోరీ పోరు నడిచింది. ఈ మూడు వార్డుల్లో ఎవరు గెలిచినా 30 ఓట్లు తేడాతోనే ఫలితం మారవచ్చు..!

  • మొత్తం మీద టీడీపీ ఏమి అంత సులువుగా తీసిపారెయ్యలేదు. ఆ పార్టీ కొన్ని వార్డుల్లో 30, 40 ఓట్లు తేడాతో పోయే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం.., సరైన ఇంచార్జి లేరు.. పార్టీ పెద్దలు పట్టించుకోవట్లేదు.. అనుకునే దశ నుండి అన్నిరకాలుగా పోరాటం చేశారు. జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి ప్రచారం చేయడంతో ఊపొచ్చింది. చివరి మూడు రోజుల పాటూ జోష్ తో ప్రచారం చేశారు. ఈ అంశాలు టీడీపీకి కలిసొచ్చాయి.
  • అధికార బలంతో పాటూ.. ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గం, బూచేపల్లి వర్గాలు కలిసి పని చేయడం వైసీపీకి పెద్ద బలం.. దర్శిలో అత్యధికంగా ఉన్న కాపు, రెడ్డి సామాజికవర్గాలు వారి వారి నేతల సూచనలకు తగ్గట్టు పార్టీ కోసం బాగానే పని చేసారు. అధికారం, యంత్రాంగం సహకారం.. పోల్ మేనేజ్మెంట్ తో వైసీపీ సులువుగా చైర్మన్ సీటు ఎగరేసుకుపోయినట్టే చెప్పుకోవచ్చు..!
- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...