Thursday, May 9, 2024
Home Uncategorized చేయి చేయి కలుపుతాం…కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం

చేయి చేయి కలుపుతాం…కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ పిసిసిగా భాధ్యతలు చేపట్టేందుకు వైయస్ షర్మిళ సిద్ధం అయ్యారు. ఈ నెల 21 న విజయవాడలో ఆమె పిసిసి పదవిని చేపట్టనున్నారు. అందులో భాగంగానే శనివారం తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగా చేయి చేయి కలుపుదాం..కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం అని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అంటే ప్రాణంతో సమానమని పేర్కొన్నారు. ఆ సిద్ధాంతం కోసం ఎంత దూరం అయిన వెల్లేవారన్నారు

ప్రస్తుతం భారతదేశంలో సెక్యులరిజం ఫ్లురలిజం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందని తెలిపారు.భారతదేశానికి మంచి జరగాలి.రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సిద్ధిద్ధించాలి.అందుకే రాజశేఖర్ బిడ్డగా కాంగ్రెస్ లో పార్టీ చేరటం జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ సిద్ధాంతం కోసం అఖరి వరకు నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కోరుకున్న విధంగా రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేయాలన్న కోరిక రాజశేఖర్ రెడ్డికి ఉందని.. ఆ కోరికను నెరవేర్చేందుకు వైయస్ షర్మిళ కృషి చేస్తారని రఘువీరా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీను రెండు సార్లు అధికారంలోకి తీసుకురావటానికి రాజశేఖర్ రెడ్డి దోహదపడ్డారు అని పేర్కొన్నారు. మళ్ళీ అటువంటి బాధ్యత షర్మిళ తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి బానిసగా ఉంటున్నాయని విమర్శించారు.షర్మిళ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం…రాష్ట్ర హక్కులు సాధించుకోవటానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. రానున్న ఆగస్ట్ 15 కి ఎర్రకోట మీద ప్రధానిగా రాహుల్ గాంధీ జెండ ఎగుర వేస్తారని ఆకాక్షించారు. అనంతరం షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈరోజు ఇది ప్రారంభమని రాబోయే రోజుల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Zencasino Online Casino Review And Bonus

1st November 2023 – CASINO.COM has Closed Down and is not taking gamers. It’s crucial that casinos display a license from a legitimate licensing body on their site. Examples of the trusted authorities we look out for embrace the UK Gambling Commission (UKGC), Malta Gaming Authority (MGA), Kahnawake Gaming Commission, along with many others. Licensed casinos keep your private and monetary information protected and publicly list their RNG audits and RTP reports in order that you know exactly what you're in for. Learn all about factoring in casino house edge and recreation odds to determine the payout in an exhaustive information. The Resorts app is pretty fast, so you need to find no problem in transferring between on line casino pages in your smartphone or pill.

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

Best Gambling Establishments that Approve Bitcoin: A Comprehensive Overview

Bitcoin, the globe's first electronic currency, has acquired significant appeal recently. Consequently, an increasing number of mifinity casino on the internet casinos have started...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...