Home వార్తలు YSRCP: గుంటూరు ఎఎన్‌యు వద్ద వైసీపీ ప్లీనరీ

YSRCP: గుంటూరు ఎఎన్‌యు వద్ద వైసీపీ ప్లీనరీ

YSRCP: అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలను జూలై 8,9 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. ఈ వేడుకల నిర్వహణకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్లీనరీ వేదికను ఆ పార్టీ నేతలు బుధవారం ఖరారు చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీ నిర్వహించనున్నారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తి కావడంతో పాటు సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సారి పార్టీ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో   భారీగా జనసమీకరణ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి పార్టీ కమిటీలను వేయనుంది.  

Exit mobile version