ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై గెలవలేక పోతున్నమనే అక్కసుతో కూటమి నేతలు ఆయనపై దాడికి తెగపడటం హేయమైన చర్య అని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు డా.పీ.గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పై దాడిని ఖండిస్తూ ఆయన శనివారం ఒక ప్రకటన విడుదలచేశారు. వై నాట్ 175 లక్ష్యం నెరవేర బోతుందని, అదే జరిగితే తమకు రాజకీయ భవిష్యత్ వుండదని కూటమి మూకలు స్పష్టంగా తెలుసుకుని ఆయనను అంతమొందించాలని కుట్రకు తెర లేపరన్నారు. ఇడుపుల పాయలో గత నెల 27న ప్రారంభం అయిన బస్ యాత్రకు ప్రజల నుండి లభిస్తున్న ఆదరణ… వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిందనేది ఈ దాష్టీకం నిరూపించింది అన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలు ఆయనకు బ్రహ్మ రథం పట్టడం జీర్ణించుకోలేక ఈ బరితెగింపుకు పచ్చ బ్యాచ్ కూటమి నేతలు కలిసి పథకం ప్రకారం తెగబడ్డారని ఆరోపించారు
దాడులు ఒక లక్ష్యం వున్న నేతను ఆపలేవని ఆయన దెబ్బ తగిలిన వెంటనే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన తీరు నభూతో న భవిష్యత్ అన్న చందంగా వుందన్నారు. జగన్ దెబ్బ తిన్న పులిలా గాండ్రిస్తున్నారని….ఆ గాండ్రింపు శబ్దానికి వాళ్ళ గుండెలు ఆగిపోవడం ఖాయమన్నారు. 2024లో రాష్ట్రంలో కేవలం వైసిపి తప్ప ఈ కూటమి పార్టీలు కనుమరుగు అవడం ఖాయమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డి పై దాడిని ఖండించడం, ఆయనకు దెబ్బ తగిలితే తమ కుటుంబ సభ్యునికి తగిలినట్లుగా భావించడం జగన్ విజయానికి సాంకేతాలన్నారు. ప్రలంతా టీడీపీ, జనసేన, బిజెపి లకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారని అన్నారు.