Monday, April 29, 2024
Home వార్తలు సిఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడిలో సూత్రధారులు వారేనని సంచలన వ్యాఖ్యలు చేసిన బోండా...

సిఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడిలో సూత్రధారులు వారేనని సంచలన వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని , సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనులే సూత్రధారులని టీడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీను లు రంగం లోకి దిగారని పేర్కొన్నారు. రాయి దాడిపై సిఎం జగన్మోహన్ రెడ్డినే స్వచ్చందంగా సీబీఐ విచారణకు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఆటర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో కొడికత్తి డ్రామా ఆడితే …నేడు గులకరాయి డ్రామా ఆడారని విమర్శించారు. సొంత వైసిపి కార్యకర్తలే గులకరాయి దాడి పై నవ్వు కుంటున్నారని ఎద్దేవా చేశారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? సిఎం ప్రచారంలో ఉండగా విద్యుత్ ఆపమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? చీకటిలో సిఎం ప్రచారం చేయటానికి వీలు ఉందా ? బిల్డింగ్ ల పై సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు.గతంలో కలకత్తా , తెలంగాణలో జరిగిన సానుభూతి ఘటనలనే ఐ ప్యాక్ టీమ్ రాష్ట్రంలో ప్రయోగిస్తుందని తెలిపారు.

వెల్లంపల్లి కంటికి గాయం ఎలా అయింది?

- Advertisement -

జగన్మోహన్ రెడ్డి కి కంటికి తగిలిన గుల కరాయి… వెల్లంపల్లి కాలి మీద పడితే ఆయన కంటికి గాయం ఎలా అయ్యంది అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి లో ఆయనకు పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ రౌడీ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గం లో వచ్చి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేసినా పోలీసు అధికారాలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

- Advertisement -

చంద్రబాబు పై జరిగిన దాడులకు సమాధానం ఏమిటి?

- Advertisement -

నందిగామ, యర్రగొండపాలెం నియోజకవర్గలలో పర్యటించిన చంద్రబాబు మిద వైసిపి నాయకులు రాళ్ళ దాడి చేస్తే పోలీస్ యంత్రాగం ఏమీ చేసింది? వాళ్ళ మిద 324 సెక్షన్ పెట్టీ చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సిఎంపై గులకరాయి విసిరితే హత్యాయత్నం కింద సెక్షన్ 307 పెడతారా అని నిలదీశారు. రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో నెల రోజుల లోపే సిఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి పై విచారణకు కమిటీ వేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...