Home వార్తలు మండపేట వైసిపి అభ్యర్థికి బిగ్ షాక్ …..శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు

మండపేట వైసిపి అభ్యర్థికి బిగ్ షాక్ …..శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. శిరోమండనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.దీంతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.1996 డిసెంబర్ 29 న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయాపాలెం లో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరకీ శిరో మండనం చేశారు. ఇద్దరికి కనుబొమ్మలు గీయించారు. బాధితుల్లో ఒకరు మరణించగా.. మిగతా నలుగురు న్యాయం కోసం కోర్టుకెళ్లారు. వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.ప్రస్తుతం మండపేట నియోజవర్గ వైసిపి అభ్యర్థిగా తోట త్రిమూర్తులు ఉన్నారు.

Exit mobile version