Friday, April 26, 2024
Home వార్తలు Toll Issue: టోల్ గేటు వద్ద ఐఏఎస్ కు తప్పని తిప్పలు..!!

Toll Issue: టోల్ గేటు వద్ద ఐఏఎస్ కు తప్పని తిప్పలు..!!

- Advertisement -


Toll Issue: ఓ టోల్ గేటు వద్ద జిల్లా కలెక్టర్ గా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వాహనాన్ని సిబ్బంది నిలుపుదల చేయడం వివాదాస్పదం అయ్యింది. సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ ల వద్ద టోల్ ఫీజు చెల్లింపు విషయంలో అధికార పార్టీ నాయకులు గొడవ చేయడం చూస్తుంటాం. నేడు ఓ ఐఏఎస్ వాహనాన్ని నిలుపుదల చేయడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది టోల్ గేటు సిబ్బందితో వాగ్వివాదానికి దిగడం ప్రకాశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే కొందరు ప్రైవేటు వాహనాల్లో వెళుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

విషయంలోకి వెళితే.. ఇటీవల కాలం వరకూ ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పని చేసి ప్రస్తుతం ఏపి కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా బాస్కర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని సైతం టోల్ గేటు వద్ద సిబ్బంది నిలువరించడం వివాదానికి కారణం అయ్యింది. ప్రకాశం జిల్లాలో కర్నూరు – గుంటూరు రహదారిపై త్రిపురాంతకం మండలం మేడపి దగ్గర ఉన్న టోల్ ప్లాజా వద్ద పోలా భాస్కర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ వివాదం చెలరేగింది. వాహనానికి టోల్ ఫీజు కట్టే విషయంపై పోలా బాస్కర్ తో టోల్ గేట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. తాను ఐఏఎస్ అధికారిని, ప్రస్తుతం కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఉన్నానని పోలా బాస్కర్ టోల్ సిబ్బందికి తెలిపినా టోల్ గేట్ సిబ్బంది ఐడీ కార్డు చూపించాలంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో పోలా బాస్కర్ వ్యక్తిగత సిబ్బంది టోల్ గేటు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. టోల్ గేటు సిబ్బంది పోలా బాస్కర్ వాహనానికి అడ్డంగా నిలబడి కదలకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలియడంతో త్రిపురాంతకం తహసీల్దార్ కిరణ్, పోలీసులు అక్కడకు చేరుకుని టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి పోలా బాస్కర్ ను అక్కడి నుండి పంపించేశారు.

- Advertisement -

ఈ సందర్భంలో టోల్ గేటు సిబ్బందిపై తహశీల్దార్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాలను, ఉన్నతాధికారులు ప్రయాణించే వాహనాలను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించడం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. టోల్ గేటు వద్ద ప్రభుత్వ వాహనాలను అడ్డుకున్నా, వాహనదారులతో దుసుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి వాహనాన్నే టోల్ గేటు వద్ద సిబ్బంది నిలుపుదల చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఓ ఉన్నతాధికారి పట్లే ఈ విధంగా సిబ్బంది ప్రవర్తిస్తుంటే సామాన్య వాహనదారులపై ఏ విధంగా వీరి ప్రవర్తన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

Most Popular

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...