ఎన్డీయే కూటమి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని టిడిపి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ఆరోపించారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. విజయవాడ పోలీసుల తీరును ఆయన ఖండించారు. సీఎంపై రాయి దాడి ఘటన తర్వాత ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్ అని కితాబిచ్చారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా దిల్లీలో కనకమేడల కేక్ కోసి వేడుకలు చేశారు. జగన్ విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని తిరోగమనం చేశారని మండిపడ్డారు. వైసిపి పాలనలో ఏపీ అల్లకల్లోలమైందని విమర్శించారు.