Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో లభించని ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో లభించని ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి తదితరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది సుప్రీం కోర్టు. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం విముఖత చూపింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్పులకు అనుగుణంగా నిందితుడు బెయిల్ మంజూరు కొరకు హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చెప్పింది. తమ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Exit mobile version