- Advertisement -
Sai dharam tej: మెగా స్టార్ చిరు మేనల్లుడు, టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై స్పోర్ట్స్ బైకు పై వెళుతూ జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మెడికవర్ హాస్పిటల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం అపస్మారక స్థితి నుండి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి.. మెగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు.త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -