Home వార్తలు నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పటిష్టంగా, సజావుగా, ప్రశాంత వాతావరణం నిర్వహించేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.అందులో భాగంగా ఒంగోలు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ప్రాంగణంలో వున్న వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు ఉదయం 10 గంటల లోపు కార్యాలయం విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ సమయాన్ని కచ్చితంగా పాటిస్తూ ఐడి కార్డులతో కార్యాలయం విధులకు హాజరై జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. రాజకీయ ప్రకటనల ప్రసార నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతి కొరకు వచ్చే వారు నామినేషన్స్ స్వీకరణ రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల తరువాత అనుమతి కొరకు రావాలని తెలిపారు.

Exit mobile version