Pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆభియోగంపై ఇటీవల పట్టాభికి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో పట్టాభిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరడం సమంజసం కాదని పట్టాభి తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ వాదించారు.
సీఎంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వాటి వెనక ఎవరున్నారనే అంశం తెలుసుకునే అవసరముందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వడం సమంజంకాదనీ, పైగా పట్టాభి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినవి కావని న్యాయవాది లక్ష్మినారాయణ వాదించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది.