Parchuru News: ప్రకాశం జిల్లా పర్చూరులో గల శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ల విగ్రహాల ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నేతలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం, కొణిజేటి రోశయ్యల జీవితాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని అన్నారు. ఆదర్శనేతల విగ్రహాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని ఏలూరి కొనియాడారు.
రోశయ్య ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా పలు సేవలు అందించారని కొనియాడారు. ఆర్యవైశ్య సంఘ నాయకుడు మామిడిపాక హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఏలూరికి ఘన స్వాగతం పలికారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏలూరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలూరి పర్యటన
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గ పరిధిలోని యద్దన పూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో పర్యటించారు. పలు వివాహ వేడుకలకు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పెద్దనందిపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు నర్రా బాలకృష్ణ గారి కుమారుని గృహంలో ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్నారు. కాగా ఇటీవల మృతి చెందిన పలువురి నేతల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఏలూరి పరామర్శించారు.