Monday, April 29, 2024
Home వార్తలు డిజిపి..సిఎస్ లను తప్పించండి….రాళ్ళ దాడిపై కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు

డిజిపి..సిఎస్ లను తప్పించండి….రాళ్ళ దాడిపై కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు

- Advertisement -

ప్రజా గళం, వారాహి విజయ యాత్ర లో భాగంగా టిడిపి , జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన కళ్యాణ్ ల మీద జరిగిన రాళ్ళ దాడిపై ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఓ పెద్ద నాటకం అని పేర్కొన్నారు. రాయి దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ తో కాకుండా సిబిఐ తో విచారణ చేయించాలని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో టీడిపి పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ…ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు జగన్ రెడ్డి డ్రామా ఆడారని విమర్శించారు. నిజానికి ఎవరు రాయి తో దాడి చేయలేదని తెలిపారు. కోడికత్తి కేసులో అమాయకుడైన శ్రీనివాస్ ను ఏ విధంగా ఐతే జైల్లో పెట్టారో…నేడు ఒక అమాయకుడిని పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే డిజిపిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి లను ఎన్నికల విధులనుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వారిలో బోండా ఉమామహేశ్వర రావు, కొనకళ్ళ నారాయణ,ఏం.షరీఫ్,పాతూరి నాగభూషణం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...