Home వార్తలు నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలులోని కిచెన్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా గూడురు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును గూడూరు రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసి అధికారులకు సమచారం అందించారు.

రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో కిచెన్ బోగీ సగానికిపైగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలును గంట పాటు నిలిచిపోయింది. ఎగిసి పడుతున్న మంటలు పక్క బోగీలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదనీ, ఆస్తినష్టం మాత్రమే జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.

Exit mobile version