Saturday, April 20, 2024
Home వార్తలు రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

- Advertisement -

అమరావతి రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఏపి హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. కాలపరిమితికి సంబంధించిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఏపి రాజధానిని సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతిలోనే కొనసాగించాలని హైకోర్టు ఆరు నెలల క్రితం ఇచ్చిన తీర్పుపై ఏపి సర్కార్ .. సుప్రీం కోర్టు లో ఎస్ఎల్పీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది, ఏపి ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, రైతుల తరపున సీనియర్ కౌన్సిల్ లు శ్యామ్ దివాన్, ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు వాదనలు జరగగా ఇరుపక్షాలకు పలు అంశాలపై ధర్మాసనం ప్రశ్నలను సంధించింది.

ఇరుపక్షాల వాదనల అనంతరం ఏపి హైకోర్టులో గతంలో ఇచ్చిన పలు ఆదేశాలపై స్టే ఇచ్చింది. నిర్దీత కాల పరిమితిలో రాజధానిలో అభివృద్ధి పనులు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. నిర్ణీత వ్యవధిలో రాజధానిలో పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు విధించడంతో ఏపి సర్కార్ కు స్వల్ప ఊరట లభించినట్లు అయ్యింది.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

Most Popular

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...