Thursday, March 23, 2023
Home వార్తలు కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం - పంచాయతీ కార్యదర్శిపై వేటు

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం – పంచాయతీ కార్యదర్శిపై వేటు

- Advertisement -

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగం నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. గన్నవరం పంచాయతీ కార్యదర్శి నక్క రాజేంద్ర వరప్రసాద్ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ కోన శశిధర్ సోమవారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు డిపిఓ నాగేశ్వరరావు ఉత్తర్వులు విడుదల చేశారు గన్నవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ పలువురు వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు జిల్లా కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదులు అందజేయడంతో గన్నవరం పంచాయతీ కార్యాలయంలో గుడివాడ డిఎల్ పీఓ పలువురు అధికారులతో కలిసి ఇటీవల విచారణ జరిపారు.

ఈ విచారణలో పంచాయతీ నిధులు ఒక కోటి 58 లక్షలు దుర్వినియోగం అయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ ను విదుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ సాధారణ నిధులతో పాటు ఇతర నిధులు బోర్డు అనుమతి లేకుండా ఖర్చు చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

Most Popular

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...