Saturday, April 27, 2024
Home విశ్లేషణ వైసిపిలో బాలినేని కథ ముగియలేదు….రానున్న రోజుల్లో పోకిరి తరహాలో ట్విస్ట్లు..

వైసిపిలో బాలినేని కథ ముగియలేదు….రానున్న రోజుల్లో పోకిరి తరహాలో ట్విస్ట్లు..

- Advertisement -

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసిపికి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికే సీట్లు కేటాయించి గెలిపించుకున్నారు. పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మూడేళ్లు మంత్రిగా ఉండగా జిల్లాలో ఆయన పెత్తనం నడిచింది.మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ లో ఆయన మంత్రి పదవిని కోల్పోయాక వరుస అవమానాలు వెంటాడుతున్నాయి. వైసిపి నుంచి ఇప్పటి వరకు విడుదల అయినా ఇంఛార్జి ల ఏడు జాబితాల్లో ఆయన పేరు లేకపోవడం పలు అనుమానాలను రేపుతుంది.మొదట నుంచి గిద్దలూరులో పోటీకి సిద్ధం గా ఉండాలని అధిష్టానం బాలినేనికి చెపుతూ వచ్చింది. ఐతే గిద్దలూరు లో పోటీ చేయడం ఇష్టం లేదని అధిష్టాన నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూనే..ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కే మరలా టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయంపై చాలా రోజులు చర్చ నడిచింది.చివరకి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమించిన తరువాత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ..తాడేపల్లి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి తరువాత ఆయన కొంచెం అధిష్టానం పై మెత్తబడ్డారు.చివరకి ఒంగోలు లో ఇళ్ల స్థలాలు కు నిధులు మంజూరు చేయించుకొని నియోజకవర్గానికి వచ్చారు.

చీరాల నుంచి బరిలోకి బాలినేని ?

- Advertisement -

నిన్న రాత్రి విడుదల ఆయిన ఏడవ జాబితాలో పర్చూరు,కందుకూరు నియోజకవర్గాలకు ఇంఛార్జి లను నియమించారు. వారం క్రితం సిఎం జగన్మోహన్ రెడ్డి తో చర్చలు జరిగినా తరువాత కూడా ఒంగోలు స్థానం ను బాలినేని కి కేటాయించకపోవడం జిల్లా రాజకీయాలను ఆసక్తిని రేకెత్తించింది.మరో పక్క చీరాల నుంచి తప్పితే తాను ఎక్కడ పోటీ చేయనని పర్చూరు ఇంఛార్జి గా ఆమంచి కృష్ణమోహన్ అధిష్టానానికి చెపుతూ వచ్చారు.అందులో భాగంగానే పర్చూరు కు కొత్త ఇంఛార్జి గా ఎడం బాలాజీ ను నియమించారు.చీరాల ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకొనేది లేదని చెప్పిన ఆమంచి కి ప్రత్యామ్నాయ మార్గం టిడిపి…జనసేన నే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

చీరాల నుంచి టీడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉంటే ప్రస్తుత వైసిపి నియోజక వర్గ ఇంఛార్జి కరణం వెంకటేష్ ఓడిపోయే పరిస్థితి ఉందని సమాచారం. రాజకీయ ఆరంగేట్రం లోనే 2014 ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీ స్థానంలో కరణం వెంకటేష్ ఓటమి పాలయ్యారు. మరోపక్క అదే ఎన్నికల్లో టిడిపి,వైసిపి లను ప్రక్కుకు నెట్టి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర ఆమంచి కృష్ణమోహన్ కి ఉంది. అందులో భాగంగానే బలమైన ఆమంచి కృష్ణమోహన్ ను ఎదుర్కోవాలి అంటే జిల్లాలో సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే అనే ఆలోచన వైసిపి పెద్దలు చేస్తున్నారని సమాచారం. ఆ నిర్ణయాన్ని బాలినేని అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానమే. ఒంగోలులో ఇండ్ల స్థలాలుకు నిధులు ఇచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బాలినేని నీ కొంత మేర ఆపే ప్రయత్నం వైసిపి అధిష్టానం చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలిచిన స్థానంలో బాలినేని పోటీకి సిద్ధం గా ఉండరని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

మద్దిశెట్టి కి లైన్ క్లియర్ అవుతుందా ?

దర్శి నియోజకవర్గంలో వైసిపి నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మద్ధిశెట్టి వేణుగోపాల్ మాత్రం జిల్లాలో వేరే చోట నుంచి అయిన పోటీ కి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మీడియా సమావేశంలో తెలిపారు.ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో… చీరాల నుంచి బాలినేని విముఖత వ్యక్తం చేస్తే..బలిజ సమాజిక వర్గం కు చెందిన మద్ధి శెట్టి వేణుగోపాల్ ను పంపించే ఆలోచనలో వైసిపి ఉందని సమాచారం.ఒంగోలు పార్లమెంట్ స్థానం మద్ది శెట్టి ఆశించిన్నప్పటకి చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమించడం తో ఆ ఆశలకు చెక్ పడింది.ఇక మద్ది శెట్టి కి మిగిలింది ఒంగోలు ,చీరాల అసెంబ్లీ స్థానాలు మాత్రమే.బాలినేని కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఒంగోలు అసెంబ్లీ స్థానంలో మద్దిశెట్టి పోటీ చేస్తారు అని సమాచారం.లేని పక్షంలో చీరాలలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆమంచి వెర్సెస్ మద్దిశెట్టి పోటీ తప్పదని సమాచారం. ఎది ఏమైనా బాలినేని తీసుకునే నిర్ణయమే జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...