Monday, April 29, 2024
Home విశ్లేషణ Ongole constituency: బలం, బలగంతో వైసీపీ..! ఆశ, అవకాశంతో టీడీపీ..!!

Ongole constituency: బలం, బలగంతో వైసీపీ..! ఆశ, అవకాశంతో టీడీపీ..!!

- Advertisement -

Ongole constituency: రాష్ట్రంలో అత్యంత రాజకీయ, సామాజిక చైతన్యం కలిగిన ప్రాంతాల్లో ఒంగోలు ప్రధానమైనది.. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, వైసీపీ, టీడీపీ బలాలు, బలహీనత;లు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి.. 2019 ఎన్నికల్లో ఊహించని ఓటమితో కాస్త కుంగిన దామచర్ల ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతుండగా.., మంత్రిగా జిల్లాను చేతిలో పెట్టుకున్న బాలినేని పట్టు పెంచుకుంటున్నారు..! ఇక్కడి తాజా పరిణామాలు, పరిస్థితులను లోతుగా గమనిస్తే…

Ongole constituency: అభివృద్ధిలో వెనుకడుగు..!

- Advertisement -

బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయిన తరువాత కరోనా వల్లనో.., లేక రాజకీయాలు ఎక్కువ అవ్వడం వల్లనో.., వివాదాల కారణంగానో అభివృద్ధి మీద ఫోకస్ చేయలేకపోయారు. ప్రభుత్వం నుండి నిధుల లేమి వల్ల కూడా కావచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడా మాత్రమే జరిగాయి. నాయకత్వం వరకు బాగుంది, పేరు ఉంది కానీ అభివృద్ధి పనులు చూసుకుంటే దామచర్ల జనార్ధన్ పనితీరు బాగుందనే ఒంగోలులో చర్చ ఉంది. ఇక్కడ టీడీపీకి రెండు అనుకూల అంశాలు ఉన్నాయి. ఒకటి గతంలో చేసిన అభివృద్ధి, మరొకటి జనసేన – టీడీపీ కలిసి పని చేస్తే ఈజీగా అవకాశాలు ఉంటాయని అంటున్నారు. వైసీపీకి సంబంధించి సంస్థాగతంగా బలంగా ఉంది. క్షేత్ర స్థాయిలో యాక్టివ్ గా పని చేసే ద్వితీయ శ్రేణి నాయకుల బలం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి జిల్లాలో ఓ పెద్ద ఆస్తి. అయితే వైసీపీకి పెద్ద మైనస్ ఏమిటంటే అభివృద్ధి నిర్లక్ష్యం చేయడంకు తోడు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇవి ఒంగోలులో ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతానికి మాత్రం 60 శాతం వరకూ వైసీపీ చాలా బలంగా ఉంది. తిరుగులేని శక్తిగానే ఉంది. అయితే టీడీపీ – జనసేన కూటమిగా పోటీ చేస్తే మాత్రం వీరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అంచనా.

జనసేనతో టీడీపీ పొత్తు ఉంటే గెలుపు ఖాయమే..!

- Advertisement -

ఒక స్ట్రాటజీ ప్రకారం టీడీపీ బలంగా ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక వేళ టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ఈజీగా గెలుచుకునే అయిదు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఒంగోలు ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా కావచ్చు.., కాపు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు.., కమ్మ సామాజిక వర్గ ఓట్లు అలానే బీసీల్లో కొందరు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అందుకే 2014 ఎన్నికల్లో వర్క్ అవుట్ అయ్యింది. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బలమైన నాయకుడు. ఆయనపై గతంలో ఒక్క అవినీతి ఆరోపణలు కూడా లేవు. చాలా క్లీన్ గా పని చేశారు. అందరినీ తన ఇంట్లో మనుషుల్లాగానే చూసుకునే వారు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అటువంటి నాయకుడు 2014లో ఓడిపోయారంటే అప్పట్లో ఈ కూటమి ప్రభావమే. ఇక్కడ జనసేన, టీడీపీ కూటమి అంత బలంగా పని చేసింది. 2019 లో వారి మధ్య పొత్తు లేకపోవడం.., వైసీపీ బలమైన గాలి.., జనార్దన్ సొంత తప్పిదాలు.. నమ్ముకున్న నేతలు దూరమవడంతో జనార్ధన్ 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో బాలినేనిపై ఓడిపోయారు. అయితే ఇప్పుడు మంత్రి బాలినేని పనితీరు పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. 2014 నుండి 2019 వరకూ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్ధన్ అభివృద్ధి పనులకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఒంగోలు నగరంలో కొంత మేరకు రూపురేఖలు మార్చడంలో, సీసీ రోడ్ల నిర్మాణం చేయడం, డ్రైయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మున్సిపల్ పరిధిలో పనులు చేయించడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒంగోలులో ప్రధానమైన తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా ప్రయత్నించారు. అందుకే జనార్ధనపై ఇప్పుడిప్పుడే మళ్ళీ గురి కుదురుతుంది.. ఆయన కూడా చురుకయ్యే పనిలో ఉన్నారు. 2019 ఓటమి నుండి తేరుకుని.. ఒంగోలులో తాను మళ్ళీ పునః రాజకీయం మొదలెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.. అటు బాలినేని మాత్రం బయటకు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికి.. లోలోపల మాత్రం ఈ రెండేళ్లలో తాను కొన్ని వర్గాలను, కొందరు నేతలను దూరం చేసుకున్నానన్న భయం వెంటాడుతుంది..! అందుకే రాబోయే రెండేళ్లలో సరిదిద్దుకునే పనిలో పడినట్టే కనిపిస్తుంది..

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...