Saturday, May 11, 2024
Home Uncategorized తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్న బాబు జగన్ పవన్ : వి.శ్రీనివాసరావు

తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్న బాబు జగన్ పవన్ : వి.శ్రీనివాసరావు

- Advertisement -

విశ్వసనీయత, పారద్శకత, నీతి నిజాయితీ గురించి పదే పదే ప్రస్తావించే జగన్‌ మోహన్‌ రెడ్డి… అవినీతి గురించి, స్కామ్‌ల గురించి ‘‘0’’ బడ్జెట్‌ పాలిటిక్స్‌ లపై మాట్లాడే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు బాండ్ల ద్వారా అందిన నిధుల విషయాన్ని ప్రజలకి ఎందుకు చెప్పడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా ఏ పెట్టుబడిదారుడు, ఏ కంపెనీ ఎంత మొత్తం ఇచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.ప్రజాస్వామ్యానికి సమాచారం చాలా అవసరం. ఎలక్ట్రోరల్‌ బాండ్లు చట్టబద్ధ క్విడ్‌ప్రోకో అని విమర్శించారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీం ధర్మాసనం స్పష్టంగా తన తీర్పులో వెల్లడించింది. ఈ బాండ్ల వ్యవహారం అతిపెద్ద స్కామ్‌. మొత్తం బాండ్లలో సగం 6,565 కోట్లు బిజెపి పార్టీకే అందాయి. అధేవిధంగా రాష్ట్రంలో వైసిపికి 337 కోట్లు, టిడిపికి 218.88 కోట్లు, జనసేనకు 21 కోట్లు కార్పొరేట్‌ సంస్ధల ద్వారా అందాయని ఎన్నికల కమీషన్‌ ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రోరల్‌బాండ్ల వ్యవహారంపై చర్చ జరుగుతుంటే వైసిపి, టిడిపి, జనసేనలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.పార్టీల జెండా రంగులే వేరు… ఎజెండా ఒక్కటేనని దుయ్యబట్టారు. రాజకీయాలను డబ్బులు ఏస్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో ప్రజలకు అర్ధమవుతుందన్నారు.ఎలక్ట్రోరల్‌ బాండ్లను రద్దు చేయాలని సిపిఎం మొదటి నుండి పోరాడుతుందని, సుప్రీంలో కేసు వేసి చివరి వరకూ పోరాడిరదన్నారు. ఈ బాండ్లు తీసుకోని పార్టీలు వామక్షాలు, సిపిఐ(యం) మాత్రమేనని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...