Friday, May 10, 2024
Home వార్తలు రాజ్యంగ లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తున్న సిఎఎ : సిపిఎం

రాజ్యంగ లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తున్న సిఎఎ : సిపిఎం

- Advertisement -

పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఎఎ ఉల్లంఘిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తూ న్నామని పేర్కొన్నారు. సిఎఎ చట్టం కింద నోటిఫై చేసిన నియమాలు.. పొరుగు దేశాల నుండి వచ్చే ముస్లింల పట్ల వివక్షాపూరిత విధానాన్ని అమలు చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లిం మూలాలు ఉన్న పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకుంటారనే భయాందోళనలను పెంచుతోంది.

తమ రాష్ట్రంలో పౌరసత్వం కోసం వ్యక్తులను గుర్తించే, నమోదు చేసే ప్రక్రియ నుండి రాష్ట్ర ప్రభుత్వాల్ని మినహాయించే విధంగా ఈ నిబంధనలు రూపొందించడ్డాయి అని పేర్కొన్నారు. సిఎఎని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించడానికే ఈ నిబంధనలు రూపొందించబడ్డాయని స్పష్టమౌతోంది అని అన్నారు. సిఎఎను ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు ఈ చట్టం నిబంధనల నోటిఫికేషన్‌ వెలువడటం అంటే, తమ ప్రయోజనాల కోసం సిఎఎ అమలును ఉపయోగించాలని బిజెపి కోరుకుంటుందని స్పష్టమౌతోంది. సిఎఎ అమలును, ఈ హానికరమైన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాడతామని తెలిపారు. ఐతే …ఈ చట్టాన్ని అమలు చేయబోదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాలు కూడా సిఎఎను తీవ్రంగా వ్యతిరేకించాయి.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...