Sunday, May 5, 2024
Home వార్తలు వైఎస్ షర్మిల అరెస్టు .. బలవంతంగా స్టేషన్ కు తరలింపు.. ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద...

వైఎస్ షర్మిల అరెస్టు .. బలవంతంగా స్టేషన్ కు తరలింపు.. ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో వరంగల్లు జిల్లా చెన్నరావుపేట టీఆర్ఎస్ నేతల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. షర్మిల కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయగా అమె కారు పాక్షికంగా ద్వంసం అయ్యింది. ఆ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ కు పంపించి వేశారు. పాదయాత్రను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు వైఎస్ఆర్ టీపీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.

ప్రగతి భవన్ (సీఎం కేసిఆర్ కార్యాలయం) వద్ద నిరసన తెలియజేసేందుకు ఈ రోజు షర్మిల నిన్న ద్వంసమైన కారులోనే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరగా పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో రాజ్ భవన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఆమె కారులోనే కూర్చుని ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. సీఎం కేసిఆర్ కు అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సమయంలో పోలీసులు షర్మిలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె ఎంతకీ వెనక్కు తగ్గలేదు. మరో పక్క భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఆమెను కారు దించే ప్రయత్నం చేయగా కారు కిటికీలు మూసివేసి ఎంతకూ బయటకు రాలేదు. పలువురు కార్యకర్తలు కారు ఎక్కి నిరసన తెలియజేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో నిరసన తెలియజేస్తున్న 15 మంది వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. షర్మిల కారులో ఉండగానే పోలీసులు క్రైన్ ను తెప్పించి అక్కడ నుండి ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా కారు డోర్ లు బద్దలు కొట్టి ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ లోపలకు తరలించారు. ఈ సందర్భంగా షర్మిలపై పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారన్న అభియోగాలపై ఐపీసీ 353, 333, 337 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటుండగా, స్టేషన్ వద్ద ఎవరూ గూడిగూడకుండా పోలీసులు కార్యకర్తలను తరిమివేశారు. షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు పరిసర ప్రాంతాలో పెద్ద ఎత్తున మోహరించారు. మరో పక్క వైఎస్ షర్మిల ఉన్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్ విజయమ్మ బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోటస్ పాండ్ వద్దనే విజయమ్మను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....