Thursday, April 25, 2024
Home వార్తలు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

- Advertisement -

ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసులో ఏపిలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, దర్యాప్తులో తాత్సారం జరుగుతోందని, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసులు కూడా నమోదు చేశారని కావున ఏపి నుండి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె వాదనలకు సమర్ధిస్తూ సీబీఐ కూడా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై తీర్పు సందర్భంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్షధారాలు నాశనం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తుపై మృతుడి భార్య, కుమార్తె వివేకా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడి (సుప్రీం కోర్టు) వరకూ రావడం బాధాకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది, పిటిషనర్ల ప్రాదమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పడం లేదని, విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉందనీ, అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్షాలను ధ్వంసం చేశారనీ, ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగించాలనీ, కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నామనీ, అందుకే కేసును హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...