Thursday, March 23, 2023
Home వార్తలు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

- Advertisement -

ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశన్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసులో ఏపిలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనీ, దర్యాప్తులో తాత్సారం జరుగుతోందని, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసులు కూడా నమోదు చేశారని కావున ఏపి నుండి ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె వాదనలకు సమర్ధిస్తూ సీబీఐ కూడా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై తీర్పు సందర్భంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్షధారాలు నాశనం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తుపై మృతుడి భార్య, కుమార్తె వివేకా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడి (సుప్రీం కోర్టు) వరకూ రావడం బాధాకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది, పిటిషనర్ల ప్రాదమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లుగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు తప్పడం లేదని, విచారణకు స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉందనీ, అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్షాలను ధ్వంసం చేశారనీ, ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగించాలనీ, కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నామనీ, అందుకే కేసును హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

Most Popular

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...